రవితేజ టైటిల్ రోల్లో నటిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దసరాకు అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఈ సినిమా విడుదలలో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేస్తూ మేకర్స్ ఓ అనౌన్స్ మెంట్ విడుదల చేశారు.
‘టైగర్నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కావడం లేదని నిరాధారమైన ఊహాగానాలు వచ్చాయి. కొన్ని శక్తులు ఈ రూమర్స్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఎందుకంటే మా చిత్రం ప్రేక్షకుల నుంచి గొప్ప ఆసక్తిని సంపాదించింది. థియేట్రికల్ ఎకోసిస్టమ్లోని వివిధ స్టేక్ హౌల్డర్స్ నుంచి మొదటి ప్రాధాన్యత పొందింది. ఎలాంటి వదంతులను నమ్మవద్దు. మీకు అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము క షి చేస్తున్నాం. అక్టోబరు 20 నుంచి బాక్స్ఆఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది’ అని మేకర్స్ తెలియజేశారు.
కొన్ని నెలల క్రితం రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై ఫస్ట్-లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేయడం ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్లను యూనిక్ స్టయిల్లో ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ ఒక విన్నింగ్ స్క్రిప్ట్ని ఎంచుకుని, దానిని ఆకట్టుకునే రీతిలో ప్రజంట్ చేస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమాలో రవితేజకు జోడిగా నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వంశీ, నిర్మాత: అభిషేక్ అగర్వాల్, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీవోపీ: ఆర్ మదీ, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.