జిల్లాలగడ్డలో ఘనంగా తీతు ఉత్సవాలు

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని  జిల్లాల గడ్డ గ్రామంలో గిరిజనులు గురువారం  తీజ్  ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తీజ్ ఉత్సవాలలో హుస్నాబాద్ ఎంపీపీ లకవత్ మానస  పాల్గొని గిరిజనుల ఆరాధ్య దైవాన్ని పూజించారు. ప్రతి ఏటా గిరిజనలు తమ పంటలు ,పాడి పశువులు, పిల్ల పాపలు సుఖ సంతోషాలతో  బాగుండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేపట్టారు.