దీప్‌ మేళాను ప్రారంభించిన సుధా రెడ్డి

హైదరాబాద్‌ : నగరంలోని హైటెక్స్‌లో దీప్‌ మేళా సందండి మొదలైంది. ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనను ఎంఇఐఎల్‌ డైరెక్టర్‌ సు ధారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై ప్రారం భించారు. అనంతరం మేళాలోని ప్రతి స్టాల్‌ వద్దకు వెళ్లి దేశ నలుమూలల నుండి వచ్చిన వస్తువులను ఆమె తిలకించారు. ఇది దీపిక్షా మహిళా క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ మేళా కొనసాగుతోంది. ఈ మేళా ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాథలకు సాయంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.