– ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునందరెడ్డి
నవతెలంగాణ-షాబాద్
ఆయిల్ ఫామ్ సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునందరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని సర్దార్నగర్ గ్రామ సమీపంలో అమృతరాజు వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న ఆయిల్ ఫామ్ పంటసాగు యాజమాన్య పద్ధతులు, ఉపాధిహామీ చట్టంలో పండ్ల తోటల పెంపకం రాయితీ వివరాలపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యానశాఖ ద్వారా ఆయిల్ ఫామ్ మొక్కలకు ఎకరానికి రూ.1160 డీ.డీ రూపంలో చెల్లించినచో ఎకరానికి 57 మొక్కలు కంపెనీ వారు రైతులకు అందజేస్తామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీ, ఓసీ రైతులకు 90 శాతం రాయితీపై అందజేస్తామన్నారు. ఐదు రోజుల పాటు, ప్రభుత్వం తరుపున పంటల అధ్యయనానికి ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లామని, అక్కడి అనుభవాలను సాంకేతిక పద్ధతులను రైతులకు వివరించినట్టు చెప్పారు. కొత్తగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులందరూ మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మట్టి పరీక్షలు ఎలా చేయాలో కిట్టు ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్ సంజరు కుమార్, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు రఘువర్మ, రామకృష్ణ, హెచ్వీ అశోక్, ఫీల్డ్ ఆఫీసర్స్ ప్రమోద్కుమార్, శ్రీకాంత్, రాఘవేందర్, రుక్మిణీ, రైతులు వెంకటయ్య, లింగం, యాదవరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.