నవతెలంగాణ- ఆర్మూర్
ఇంటింటికి సర్వే న పకడ్బందీగా నిర్వహించాలి అని జిల్లా వైద్య ఉప అధికారి డాక్టర్ రమేష్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గురువారం సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సాయి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించారన్నారు ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు ప్లాస్టిక్ డబ్బాలు పాత కుండలు పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా అభివృద్ధి చెంది డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలు తాయని అన్నారు. దోమ పుట్టుక గురించి దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రమేష్ పరిశీలించి ఇంటింటి సర్వే ను పకడ్బందీగా నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు . ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్ ఆనంద్ ఆశా కార్యకర్తలు శిరీష సుభద్ర తదితరులు పాల్గొన్నారు.