
హౌజింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి, దుర్గామాత ఆలయం లో శ్రీ కృష్ణాష్టమి పర్వదినం ను గురువారం ఘనంగా కమిటీ అధ్యక్షులు మోహన్ దాస్ నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తులు శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు జరుపుకుంటారని, అదేవిదంగా ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఆలయములో నిర్వహిస్తామని అభిషేకం, అర్చన, శ్రీ కృష్ణుని ఉయ్యాల లో కూర్చోబెట్టి ఉయ్యాల సేవ చేసి హారతి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో భక్తులు నారాయణ గౌడ్, గడ్డం శ్యామ్ సుందర్, కొక్కుల రమేష్, హేమ లత, రూప మీనా, పుష్ప, హేమ తదితరులు పాల్గొన్నారు.