‘ప్రతీ ఆత్మకు ఒక కధ ఉంటుంది. అలాగే చండికకి కూడా ఓ కథ ఉంది. కానీ తన కథ మాత్రం ఎప్పుడు ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కథ. ఆ కథ ఏంటి? తన తాపత్రయం ఏంటి? ఎందుకు మనల్ని భయపెట్టాలని అనుకుంటోంది అనే అంశాన్ని ‘చండిక’ చిత్రంలో చూపించబోతున్నాం’ అని దర్శకుడు తోట కష్ణ అన్నారు.
వీర్, శ్రీహర్ష, నిషా, ఖుషి ప్రధాన పాత్రలలో కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ సినిమాకి సంబంధించి నాలుగు ట్రైలర్లను ఆవిష్కరించారు. అతిథులుగా పాల్గొన్న తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కె.బసిరెడ్డి, నిర్మాతలు సాయివెంకట్, మోహన్ గౌడ్, గురురాజ్ ఒక్కొక్కరు ఒక్కో ట్రైలర్ను రిలీజ్ చేశారు.
‘అభిరుచి కలిగిన నిర్మాత, పరిశ్రమలో నలభై సంవత్సరాల అనుభవం కలిగిన దర్శకుడు తోట కష్ణ కలయికలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ట్రైలర్స్ నేటి హర్రర్ ట్రెండ్కు తగ్గట్టుగా విభిన్నంగా ఉన్నాయి’ అని విచ్చేసిన ముఖ్య అతిథులందరూ ప్రశంసించారు.
దర్శకుడు తోట కష్ణ మాట్లాడుతూ, ‘హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో ఆత్మ ప్రతీకారం తీర్చుకునే అంశం చాలా కొత్తగా ఉంటుంది. పాత్రధారులంతా తమ పాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారు. పలు చిత్రాలను తీసిన నిర్మాత గురురాజ్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించారు’ అని అన్నారు. ‘ఈ చిత్రానికి నేనే కథ అందించాను. కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్ర నిర్మాత కె.వి.పాపారావు తెలిపారు. ఈ చిత్రానికి రచన: దాసరి వెంకటేష్, మాటలు:: తోటపల్లి సాయినాధ్, సినిమాటోగ్రఫీ: నగేష్, సంగీతం: చేతన్ విన్, ఎడిటింగ్: మన శ్రీను, నిర్మాత కె.వి.పాపారావు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తోట కష్ణ.