అయోధ్యలో వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం అవిస్కృతం

– అంబరాన్నంటిన బాల రామాలయం
– 12:29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట
– 84 సెకండ్ల పాటు సాగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
నవతెలంగాణ -పెద్దవూర : అయోధ్య లో నవ నిర్మిత రామ మందిరంలో నీల మేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించిన భక్తజనం అంతరంగంలో పులకించిపోయారు.అయోధ్య నగరమంతా రామ నామంతో మార్మోగింది.
ఈ మహత్కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7వేల మంది విచ్చేశారు.రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా తిలకించి పులకించిపోయారు అయోధ్య నగరమంతా రామ్ లీలా, భగవద్గీత కథలు, భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించింది.ఈ సందర్భంగా వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ బుసిరెడ్డి పాండురంగారెడ్డి హైదరాబాద్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ లోని తమ సంస్థ లో పనిచేసే వారికి  అన్నసమారాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై శ్రీరామ్,జై శ్రీరామ్, మీ బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు  శుభాకాంక్షలు తెలిపారు.