నడుస్తూ చెత్త ఏరివేతతో.. స్వచ్ఛ పట్టణం

– సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ – సిద్దిపేట
నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేత తో స్వచ్ఛ పట్టణాన్ని చేయొచ్చంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువజామున ప్రతి వార్డులో కలియ తిరుగుతూ ప్రజలకు చెత్తో పదేశం చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో 18వ వార్డు వెంకటేశ్వర కళామందిర్‌ థియే టర్‌ నుంచి నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. మన చెత్త, మన బాధ్యత అంటూ చెత్త పేరుకుపోతే కలిగే అనర్థాలపై గృహిణులకు అవగాహన కల్పించారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్లు, కుర్‌ కురే ప్యాకెట్లు, చాక్‌లెట్‌ వెఫర్లు, వాటర్‌ గ్లాసులు, చారు గ్లాసులు, శానిటరీ వేస్ట్‌ చెత్తను స్వయంగా ఎత్తి సంచిలో వేశారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజల కు సూచించారు. మన ఇంటి శుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, మున్సిపల్‌ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.