మెప్పించే మాస్‌ ఎంటర్‌టైనర్‌

 pleasing Mass Entertainerకంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్‌గా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌. ఎల్‌.ఎస్‌. క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ‘పోకిరీ జులాయిలు..’ అంటూ సాగే ఈ పాటను హీరో ఉపేంద్ర, వంద మంది జూనియర్‌ ఆర్టిస్టులు, ఇరవై మంది డ్యాన్సర్ల పై భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ‘హీరో కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర ఆసక్తిని గమనించి తనతో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తున్నాను. ఒక్క పాట మినహా ఈ సినిమా పూర్తయ్యింది. ఈ నెల 29న మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను బహుమతిగా ఇస్తాను’ అని అన్నారు. ‘ఉపేంద్ర ఓ కొత్త హీరోలా కాకుండా చక్కటి నటనను కనబరుస్తున్నారు. నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛతో నెల రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేశాం. చక్కటి కమర్షియల్‌ అంశాలతో ఉన్న మాస్‌ సినిమా ఇది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టు యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా’ అని దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. చెప్పారు. హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, ‘యూత్‌ను ఆకట్టుకునే మంచి పాయింట్‌తో దర్శకుడు
ఈ సినిమాను ఎంతో బాగా మలుస్తున్నారు’ అని తెలిపారు.