నవ్వించే కిడ్నాప్‌ల పర్వం..

నవ్వించే కిడ్నాప్‌ల పర్వం..చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధాదాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్‌ బ్యానర్‌ పై సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మిస్తున్న హిలేరియస్‌ క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పారిజాత పర్వం’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను యాంకర్‌ సుమ కనకాల లాంచ్‌ చేశారు. కిడ్నాప్‌ ప్లాన్‌ని సునీల్‌ తన గ్యాంగ్‌తో చెబుతుండగా మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌’అనే ట్యాగ్‌ లైన్‌ని జస్టిఫై చేస్తూ ఇందులో చూపించిన సన్నివేశాలు హిలేరియస్‌గా ఉన్నాయి. చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రల చుట్టూ నడిపిన కిడ్నాప్‌ సీక్వెన్స్‌లు హైలెట్‌గా ఉంటూ కథపై చాలా క్యురియాసిటీని పెంచాయి. ట్రైలర్‌ చివర్లో వైవా హర్ష చెప్పిన సినిమా రివ్యూ హిలేరియస్‌గా ఉంది. ఈనెల 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి, సమీర్‌, గుండు సుదర్శన్‌ , జబర్దస్త్‌ అప్పారావు, టార్జాన్‌, తోటపల్లి, మధు, జబర్దస్త్‌ రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత -అనంత సాయి, డీవోపీ-బాల సరస్వతి, సంగీతం-రీ, ఎడిటర్‌- సశాంక్‌ వుప్పుటూరి, ఆర్ట్‌ డైరెక్టర్‌ – ఉపేందర్‌ రెడ్డి.