– స్వామినాథన్ అంత్యక్రియలు…
చెన్నై : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ (98) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య శనివారం పూర్తయ్యాయి. అధికార లాంఛనాలతో చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో స్వామినాథన్ పార్థివ దేహానికి ఆయనకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. స్వామినాథన్ పార్ఘీవదేహానికి చెన్నైలోని తేనాంపేటలోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు, ప్రజలు అభిమానులు నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నేత పళనిస్వామి తదితరులు స్వామినాథన్కు నివాళులర్పించారు.