మేడారంలో ఘనంగా గుడి మెలిగే పండుగ..

– మహా జాతర పూజా కార్యక్రమాలు ప్రారంభం
– మేడారంలో సమ్మక్క, కన్నెపెళ్లిలో సారలమ్మ ఆలయాలు శుద్ధి
– ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు
నవతెలంగాణ- తాడ్వాయి
మేడారం, కన్నెపల్లి గ్రామాలలో పూజారులు బుధవారం గుడి మెలిగే పండుగ ఘనంగా నిర్వహించారు. మహా జాతరకు రెండు వారాల ముందు ఈ గుడి మెలిగే పండుగ ను చేస్తారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు అత్యంత నియమ నిష్ఠలతో డోలు వాయిద్యాలు నడుమ, పూజారులు వారి ఇండ్లను శుద్ధి చేసుకుని, అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించి గుడిపై కప్పారు. అనంతరం పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు గారి సతీమణి సిద్దబోయిన భారతి ఆధ్వర్యంలో మహిళలు కొక్కెర వినోదం, సిద్దబోయిన వైష్ణవి, విజయ, మరియు మహిళలు గుడి లోని వనదేవతను రంగురంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. గుడి ప్రాంగణం మొత్తం రంగురంగుల ముగ్గులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గుడి మెలిగే పండగతో వనదేవతల మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఇప్పటినుంచి పూజారులు అత్యంత నియమనిష్టలు పాటిస్తారు. మల్లి వారం 14 తారీకు నాడు వచ్చే బుధవారం రోజున మండే మెలిగే పండుగను నిర్వహిస్తారు. దీంతో జాతర ఘట్టం ప్రారంభం అవుతుంది. మేడారం జాతర ఉత్సవాలు ఊపందుకున్నాయి. మళ్లీ వచ్చే మూడవ బుధవారం 21 తారీకు నా జాతర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునేందర్, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, బొక్కెన్న, మహేష్, సిద్ధబోయిన అరుణ్, సిద్దబోయిన పాపారావు, దశరథం, సిద్ధబోయిన నితిన్, అభ్యుదయ సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన బోజారావు, రానా రమేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.