ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని కరుణపురం  గ్రామాల్లోని విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో 1996-1998 బ్యాచ్కు చెందిన  ఇంటర్మీడియెట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ధన్ పాల్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థి జీవితం తిరిగిరానాటువంటిదని, ఈరోజు 24 సంవత్సరాల తర్వాత  వారి గత స్మృతులను స్మరించుకొనుటకు ఏర్పాటుచేసి ఆత్మీయ సమ్మేళనం చాలా సంతృప్తికరంగా ఉందన్నారు. విద్యను ఆ రోజులలో సక్రమంగా  అందించాలంటే కనీస మౌలిక వసతులు లేకుండా ఉండేవి కావని గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా ఈ రోజులలో విద్యను ప్రతి ఒక్కరు కొనుక్కోవడం జరుగుతుందని ఆవేదన  వ్యక్తం చేశారు. ఆ రోజులలో గురువులను దైవంగా భావించే వారని, నేటితరం విద్య సంస్థలను, గురువులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీర్లను గుర్తు చేస్తూ బాధపడ్డారు. ఏదిఏమైనాప్పటికీ ఆ రోజులే బాగుండేవని పూర్వ విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను స్వయంగా మాట్లాడి వారి అనుభవాలు చేస్తున్నారు. గతంలో వారు చేసిన తీపి జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. అనంతరం గురువులను శాలువాలకు మెమొంట్లతో పుష్పగుచ్చాలతో సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రంగారెడ్డి,జైపాల్,రవీందర్,అరుణ,విజయ కుమారి, కలకోట యాదగిరి,పూర్వ విద్యార్థులు జంబు రవీందర్ పుట్ట నవీన్ రూప క్రిస్టఫర్ కొత్తపల్లి రవీందర్ కనకం రమేష్ రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.