యూనిక్‌ కాన్సెప్ట్‌తో భారీ మల్టీస్టారర్‌ సినిమా

ధనుష్‌, నాగార్జున అక్కినేని నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌కి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి (ఏషియన్‌ గ్రూప్‌ యూనిట్‌), అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్స్‌ పై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మిస్తునారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. పూజా కార్యక్రమానికి సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు, భరత్‌ నారంగ్‌, జాన్వీ నారంగ్‌ తదితరులు హాజరయ్యారు. ధనుష్‌తో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. సంక్రాంతికి వచ్చిన ధనుష్‌, నాగార్జున చిత్రాలు కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం), నా సామిరంగ బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో ఈ మల్టీ-స్టారర్‌ ప్రాజెక్ట్‌ పై ఉన్న ఎగ్జైట్‌మెంట్‌ రెట్టింపు అయ్యింది. ఇద్దరు స్టార్స్‌ని బిగ్‌ స్క్రీన్స్‌ పై కలసి చూడటాని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. రెండు బ్యాక్‌-టు-బ్యాక్‌ బ్లాక్‌బస్టర్స్‌ ఫిదా, లవ్‌ స్టోరీని రూపొందించిన తర్వాత శేఖర్‌ కమ్ముల బిగ్‌ కాన్వాస్‌పై యూనిక్‌ కథతో ఈ మల్టీస్టారర్‌ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌ పరంగానూ సినిమా సాలిడ్‌గా ఉండబోతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి, ప్రొడక్షన్‌ డిజైన్‌: రామకష్ణ సబ్బని, మోనికా నిగోత్రే.
25న తెలుగులో కెప్టెన్‌ మిల్లర్‌ రిలీజ్‌
ధనుష్‌ నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈనెల 12న సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్స్‌ అందుకుంది. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా హీరోలు నాగార్జున, వెంకటేష్‌ తమ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఈ చిత్ర తెలుగు థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.