చంద్రూ దర్శకత్వంలో భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌

‘ఈగ, బాహుబలి’ వంటి స్ట్రైట్‌ తెలుగు చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌. శనివారం కిచ్చా సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయ్యింది. డైరెక్టర్‌ ఆర్‌ చంద్రూ ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు స్క్రిప్ట్‌ సూపర్‌ విజన్‌ చేస్తుండటం విశేషం. కన్నడలో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను రూపొందించిన ఆర్‌ సీ స్టూడియోస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆర్‌ చంద్రూ, కిచ్చా సుదీప్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే మేకింగ్‌తో తెరపైకి రాబోతోంది. త్వరలో ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారు.