ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా

సాయిరామ్‌ శంకర్‌, యషా శివకుమార్‌, హెబ్బా పటేల్‌ హీరో, హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నవీన్‌ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్‌ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెరు దరువెరు’. ఈనెల 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
మాది కష్ణాజిల్లా దగ్గర నూజివీడు. మా బంధువులు కష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుంటారు. అలా నాకు సినిమా ఇండిస్టీతో అనుబంధం ఉంది. పూణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్‌ చేసిన తర్వాత సతీష్‌ వేగేశ్న దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్‌ స్టార్ట్‌ చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో దర్శకుడిగా మారాను.
నిర్మాత దేవరాజ్‌ పోతూరు కథ వినగానే ఆయనకు నచ్చటంతో సినిమా చేయటానికి అంగీకరించారు. దర్శకుడిగా ఇది తొలి చిత్రమే అయినప్పటికీ ఎలాంటి ప్రెషర్‌ ఫీల్‌ కాలేదు. అందుకు కారణం నిర్మాత దేవరాజ్‌, హీరో సాయిరామ్‌ శంకర్‌ సహా ఎంటైర్‌ టీమ్‌ అందించిన సపోర్ట్‌.
కామారెడ్డి ప్రాంతంలో ఉండే హీరోకి ఓ సమస్య వస్తుంది. దాని పరిష్కారానికి హీరో ఏం చేశాడు?, ఎందుకు హైదరా బాద్‌ వచ్చాడు.. సమస్యను ఎలా పరిష్కరించు కున్నాడనేదే మా సినిమా మెయిన్‌ కథాంశం. సినిమా చిన్న సెంటిమెంట్‌తో ప్రారంభం అవుతుంది. అందరికీ కనెక్ట్‌ అయ్యే కొన్ని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాం.
అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. భీమ్స్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. అలాగే మంచి సీనియర్‌ ఆర్టిస్టులు నటించారు. హీరోయిన్స్‌ యషా శివకుమార్‌, హెబ్బా పటేల్‌కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కథలో భాగంగా వారి
పాత్రలు ట్రావెల్‌ అవుతాయి.
ఈ సినిమా దర్శకుడిగా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ నిచ్చింది. సినిమా ఫస్ట్‌ కాపీ చూసి నిర్మాత చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రెండున్నర గంటల పక్కా ఎంటర్‌టైనర్‌ ఇది. నెక్ట్స్‌ సినిమా ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు. డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.