నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు.
ఈ మూవీ ఈనెల 9న రాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం దర్శకుడు యదు వంశీ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
నేను ఓ ఇండీ ఫిల్మ్ తీశాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. మా ఊళ్లో జరిగే జాతరను బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నాను. ఇందులో ప్రతీ కుర్రాడి కథ కనిపిస్తుంది. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియెన్స్ కూడా ఉంది. ఇలాంటి కథలో తెలిసిన వాళ్లు నటించి ఉంటే.. వాళ్లకంటూ సపరేట్ బ్యాగేజ్ ఉండేది. ఇందులో ప్రతీ పాత్ర కూడా హీరోలానే ఉంటుంది. అందుకే అందరూ కొత్త వాళ్లతోనే ట్రై చేశాను. నాకు ఈ కథ మీద చాలా నమ్మకం ఉంది. రెగ్యులర్ పంథాలో వెళ్లకూడదనే ఉద్దేశంలో ఇలాంటి కథను ఎంచుకున్నాను. 2019లో కొంత రీసెర్చ్ చేశాను. జయప్రకాష్ నారాయణ, పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్లు మాట్లాడిన ఆ మాటల స్పూర్తితోనే కొన్ని సీన్లను రాసుకున్నాను. ఫ్రెండ్ షిప్, పొలిటికల్ అంశాలను కూడా ఇందులో జొప్పించాను.
స్క్రీన్ మీద సినిమా ఎలా కనిపించాలనేది నిర్మాత నిహారికకి బాగా తెలుసు. దానికి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. చెప్పింది చెప్పినట్టుగా తీసే ఫ్రీడం ఇచ్చారు.
కేరళలో ఉన్నంత అందం కోనసీమలో ఉంది. ఆ అందాన్ని మరింత అందంగా చూపించాం. మా రాజు పెట్టిన లైటింగ్, చూపించిన విజువల్స్ అందరినీ ఆకట్టు కుంటున్నాయి. 90వ దశకంలోకి తీసుకెళ్లగలిగాం. అనుదీప్ పాటలు అందరినీ మెప్పించాయి.
ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది. థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావో ద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఉన్న ఎంటర్టైన్మెంట్ను అందిస్తాం. థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్లో కూర్చుంటో నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది.
చిరంజీవి సినిమా చూసి అందరూ అద్భుతంగా నటించారని చెప్పడం, వరుణ్ తేజ్ కూడా సినిమా చూసి 11 మంది ఇరగ్గొట్టేశారని చెప్పడంతో చాలా సంతోషం కలిగింది. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ కథ రాసుకుంటున్నాను.