శ్రీవెంకట సుబ్బలక్ష్మి మూవీస్ పతాకంపై అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘నీ వెంటే నేను’. ఈ చిత్రంతో బాలు – స్నేహ హీరో,హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వీరిద్దరూ స్వతహా సాప్ట్వేర్ ఇంజనీర్లు కావడం విశేషం. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ క్లీన్ లవబుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ‘సినీబజార్’ అనే డిజిటల్ థియేటర్లో అక్టోబర్ 6న 177 దేశాల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సినీబజార్ సి.ఇ.ఓ రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుండడం చాలా ఆనందంగా ఉంది. పైరసీకి ఎట్టి పరిస్థితుల్లో తావులేని విధంగా సినీ బజార్ను తీర్చిదిద్ధాం’ అని అన్నారు.