ముంబయిలో నయా షెడ్యూల్‌ షురూ..

ముంబయిలో నయా షెడ్యూల్‌ షురూ..హీరో రామ్‌ పోతినేని డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌తో చేస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ ఏకధాటిగా జరుగుతోంది. తన మునుపటి చిత్రం ‘స్కంద’ కోసం బరువు పెరిగిన రామ్‌ ఈ సినిమా కోసం కొన్ని కిలోల బరువు తగ్గి సిక్స్‌-ప్యాక్‌ అబ్స్‌ సాధించారు. ఈ సందర్భంగా రామ్‌ పంచుకున్న ఫోటోలు తన కండలు తిరిగిన ఫిజిక్‌ని ప్రజెంట్‌ చేస్తున్నాయి. రామ్‌ తన ముఖాన్ని దాచుకున్నప్పటికీ, వెస్ట్‌లో మాచోగా కనిపిస్తున్నారు. రామ్‌ని ఈ తరహాలో మేకోవర్‌ చేసిన క్రెడిట్‌ పూరి జగన్నాథ్‌కి కూడా దక్కుతుంది. రామ్‌, పూరి కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్‌ అయిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. మాస్‌, యాక్షన్‌ సినిమాలని ఇష్టపడేవారికి ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. వచ్చే ఏడాది మహాశివ రాత్రి కానుకగా మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.