ఆగేయ బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం

– ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి : ఆగేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కేంద్రీకృతమైందని,ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తా, రాయల సీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.ఈ మేరకు ఆ సంస్థ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10న అల్లూరి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.11న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.12న తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, నెల్లూరు, వైఎస్‌ఆర్‌, శ్రీసత్య సాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశ ముందని తెలిపింది. కాకినాడ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.