హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ ‘ఎట్ ది రేట్ నైన్టీస్’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరిస్ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం సమర్పిస్తున్నారు. వెంకటేష్ ఈ వెబ్సిరీస్ టీజర్ని బుధవారం లాంచ్ చేశారు. 90ల్లోని జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ టీవీలో ‘మనోరంజని’ కార్యక్రమాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. శివాజీ ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, స్కూల్ టీచర్. అతని భార్య పాత్రలో వాసుకి నటించారు. వీరి ముగ్గురు పిల్లలు. ఈ కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల అనందాలు, సరదాలు, సంఘర్షణలను ఎంతో అందంగా, మనసుని హత్తుకునేలా చూపించాయి. ఈ సంక్రాంతికి ఈటీవీ విన్ యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ వెబ్ సిరీస్ రానుంది అని మేకర్స్ తెలిపారు.