
– నేనున్నానంటూ భరోసా.. అందరికి మనోధైర్యం..
– అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపిస్తూ మానవత్వం చాటుతున్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం,త్రిపురారం గ్రామానికి చెందిన నల్లగంటి పెంటమ్మ(85) గురువారం స్వర్గస్తులు అయ్యినారని తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించారు. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని పిలుపునిచ్చారు.సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు.
దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్నఅని మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమేఅని భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన ఈసందర్బంగా
తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…