నవ్వించే గూఢచారి

వెన్నెల కిశోర్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్‌ దర్శకుడు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. సంయుక్తా విశ్వ నాథన్‌ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. ‘చారి 111’ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా డిజైన్‌ చేశారు. థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి ‘వెన్నెల’ కిశోర్‌ వస్తున్నట్లు ఉంది. ‘చారి 111’ ఫస్ట్‌ లుక్‌, కాన్సెప్ట్‌ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్‌ఫ్యూజ్‌ అయ్యే గూఢచారిగా ‘చారి’ పాత్రలో వెన్నెల కిశోర్‌ కనిపిస్తారని దర్శక,నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్‌ సినిమా అని చెప్పారు. చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ మాట్లాడుతూ, ‘ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్‌ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్‌ చేశాడనేది సినిమా’ అని అన్నారు. ‘స్పై జోనర్‌ సినిమాల్లో ఇది కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్‌ నటన, టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం సినిమాకు హైలైట్‌ అవుతాయి. అతి త్వరలో ట్రైలర్‌, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత అదితి సోనీ అన్నారు.