గంగుల ప్రచార వాహనంపై చెప్పు వేసిన టీచర్‌

On Gangula's campaign vehicle The teacher said– కేసు నమోదు
నవతెలంగాణ – కరీంనగర్‌ రూరల్‌
కరీంనగర్‌ మండలంలోని గోపాలపూర్‌ గ్రామంలో మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎల్‌ఈడి స్క్రీన్‌ వాహనంపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పు విసిరేశారు. దాంతో అతనిపై మంగళ వారం కేసు నమోదైంది. కరీంనగర్‌ రూరల్‌ పరిధిలోని గోపాలాపురం గ్రామంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్‌ ప్రచారం నిర్వహించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన వాహనాన్ని నిలిపారు. గంగుల కమలాకర్‌కు ఓటేయాలంటూ ఎల్‌ఈడి స్క్రీన్‌ల ద్వారా ప్రచారం చేస్తున్న సమయంలో తెరపైకి మంత్రి ఫొటో రాగానే శ్రీరామోజు జగదీశ్వరాచారి అలియాస్‌ జగతి అనే ప్రభుత్వ టీచర్‌ తన చెప్పుతో స్క్రీన్‌పై కొట్టి దుర్భాషలాడాడు. ఈ మేరకు గ్రామానికి చెందిన ఆరే ప్రశాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్‌ 290బి, 209, 504సెక్షన్లలో కేసు నమోదు చేశారు.