
– తాడ్వాయి తాసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
– ఓటర్ జాబితా పరిశీలన
నవతెలంగాణ -తాడ్వాయి
18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి లింగ కులమత భేదం లేకుండా పారదర్శకంగా ఓటరు జాబితా నమోదు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. మంగళవారం తాడ్వాయి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. తాడ్వాయి మండల పరిధిలో నమోదైన ఓటరు జాబితాను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్తవహించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని, గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని, పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా చూసుకోవాలని, ఇంకా ఎవైన అవసరమైతే సమకూర్చాలని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాసు, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి లింగ కులమత భేదం లేకుండా పారదర్శకంగా ఓటరు జాబితా నమోదు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. మంగళవారం తాడ్వాయి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. తాడ్వాయి మండల పరిధిలో నమోదైన ఓటరు జాబితాను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్తవహించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని, గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని, పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా చూసుకోవాలని, ఇంకా ఎవైన అవసరమైతే సమకూర్చాలని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాసు, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.