పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌హీరో విశాల్‌ తాజాగా ‘రత్నం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డైరెక్టర్‌ హరి దర్శకత్వంలో కార్తికేయన్‌ సంతానం అన్‌ కాంప్రమైజ్డ్‌గా రూపొందిస్తున్నారు. విశాల్‌, దర్శకుడు హరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. దీంతో వీరిద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో మంచి హైప్‌ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్‌ బ్యానర్‌ మీద తెలుగులో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, కే రాజ్‌ కుమార్‌ సంయుక్తంగా ఈనెల 26న రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌, సాంగ్స్‌ అన్నీ కూడా సోషల్‌ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ‘ఏపీ, తమిళనాడు బోర్డర్‌ గొడవల ఆధారంగా ఈ కథ నడిచేలా ఉంది. ఇక హీరోయిన్‌ కోసం హీరో చేస్తున్న ఊచకోతను చూస్తుంటే మాస్‌, యాక్షన్‌ జోనర్లను ఇష్టపడే ఆడియెన్స్‌కు పండుగలానే కనిపిస్తోంది. ట్రైలర్‌లో దేవీ శ్రీ ప్రసాద్‌ ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. యాక్షన్‌, లవ్‌ సీన్లకు తగ్గట్టుగా మంచి ఆర్‌ఆర్‌ ఇచ్చారు. కళ్యాణ్‌ సుబ్రహ్మణ్యం అలంకార్‌ పాండియన్‌ కో-ప్రోడ్యుసర్‌గా, ఎం సుకుమార్‌ కెమెరామెన్‌గా, టీ ఎస్‌ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈనెల 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.