పరమత ద్వేషం, రాజ్యాంగ విలువలకు విరుద్ధం

Absolute hatred is against constitutional valuesగడచిన దశాబ్ద కాలంగా భారతదేశాన్ని హిందూ జాతీయవాద భారతీయ జనతాపార్టీ పాలిస్తుంది. భారతీయ జనతాపార్టీ, హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌కు చెందిన సంతతి. ఆరెస్సెస్‌ చాలామంది సంతానాన్ని కలిగి ఉంది, దానికి వందల సంఖ్యలో అనుబంధ సంస్థలు, లక్షల సంఖ్యలో వాలంటీర్లు (స్వయం సేవకులు), వేల సంఖ్యలో ప్రచారక్‌ లుగా పిలువబడే సీనియర్‌ కార్యకర్తలున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి హిందూ రాజ్యస్థాపనకు సంబంధించిన ఎజెండాను అది రెట్టింపు వేగంతో కొనసాగిస్తుంది. మతపరమైన అంశాలు, రామ మందిరం, ఆవు-గొడ్డు మాంసం, లవ్‌ జీహాద్‌, ఇంకా ఇతర సమస్యల్ని తీవ్రతరం చేయడం ద్వారా బీజేపీ ఎన్నికల రణరంగంలో బాగా దూసుకుపోతోంది. బీజేపి, ఎన్నికల్లో తన బలాన్ని బాగా పెంచుకోవడంలో మత హింస ప్రధానమైన అంశంగా పని చేస్తుంది. ఆ హింస కూడా ”మైనార్టీ లను ద్వేషించండి” ప్రాతిపదికన జరుగుతున్న ప్రచారంతో నిర్మితమైంది. ద్వేషాన్ని సష్టించడానికి వారికి అనుకూలమైన యంత్రాంగాలు ఉన్నాయి. అవి :శాఖలు, పాఠశాలలు, గోదీ మీడియా, సోషల్‌ మీడియా, ఐటీ సెల్స్‌, ఇతరములు. రాష్ట్రాల్లో, కేంద్రంలో బీజేపి అధికారంలో ఉన్నప్పుడు శిక్షా ర్హమైన నేరంగా పరిగణించబడే ద్వేషపూరిత ప్రసంగాన్ని మరింత ఉత్సాహంతో, ఉల్లాసంగా ఉపయోగిస్తారు. ఈ ద్వేష పూరిత ప్రసంగాల్లో తేలియాడే వారికి, శిక్ష మినహాయింపు ఆనందాన్ని ఆస్వాదించే విషయం బాగా తెలుసు.
భారతదేశంలో మతపరమైన మైనార్టీలకు వ్యతిరేకంగా ద్వేష పూరిత ప్రసంగాలను తయారుచేసే ఒక వాషింగ్టన్‌-డీసీ ఆధారిత గ్రూప్‌ అయిన ”ఇండియా హేట్‌ ల్యాబ్‌” విడుదల చేసిన తాజా నివేదికలో ఇదంతా ధ్రువీకరించబడింది. ”భారతదేశంలో ద్వేష పూరిత ప్రసంగాల సంఘటనలు” శీర్షికతో ఉన్న నివేదికలో, 2023 మొదటి అర్ధ సంవత్సరంలో 255 సంఘటనలు జరుగగా, రెండవ అర్ధ సంవత్సరంలో ఆ సంఖ్య 413కు పెరిగింది, అంటే 63శాతం పెరుగుదల.నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, మొత్తం 498 సంఘటనల్లో 75శాతం సంఘటనలు బీజేపీ పాలితరాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన), ఢిల్లీ (ఇక్కడ పోలీస్‌ వ్యవస్థ, పబ్లిక్‌ ఆర్డర్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీ నంలోనే ఉంటుంది) లోనే చోటుచేసుకున్నాయి. వాటిలో 36శాతం (239) సంఘటనలు ముస్లింలకు వ్యతిరేకంగా ఇచ్చిన హింసాత్మక పిలుపుల్లో భాగంగా జరిగాయి. 63శాతం(420) సంఘటనలు లవ్‌ జీహాద్‌, ల్యాండ్‌ జీహాద్‌, జనాభా జీహాద్‌ల పిలుపుల్లో భాగంగా జరిగాయి. దాదాపు 25శాతం (169) సంఘటనలు ప్రార్థనా స్థలాల్లో ముస్లింలను లక్ష్యం చేస్తూ, వారికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జరిగాయి.
ఇప్పటికే ఈ సంఘటనల ఫలితాలు అందరికీ తెలిసినవే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు, కూల్చివేతల్ని అదనంగా ఉపయోగించిన విషయం మనకు ఇంకా గుర్తుంది. ఇలాంటి చర్యలన్నీ ముస్లింల ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి చేపట్టారు. అక్కడక్కడ మసీదు కూల్చివేతలు పెద్దలెక్కలో విషయం కాదు. బహిష్కరణకు గురవుతున్న ముస్లిం వీధి వ్యాపారులు, వర్తకులు అప్పుడప్పుడు ఆసరాగా ఉంటున్నారు. ప్రేరేపిత పరిపాలనా యంత్రాంగం చూపించే పక్షపాతం నిత్యకత్యంగా మారింది. ముస్లిం సమాజంపై పడుతున్న ప్రభావం, అభద్రతా భావాన్ని, వెలివేతను పెంచుతుంది. ద్వేషపూరిత గోడలు పగటిపూట బలోపేతం అవుతున్నాయి. ఆలస్యంగా శ్రీ మహా విష్ణువుకు పునర్జన్మగా పిలువబడుతున్న ప్రధానమంత్రి, వారి బట్టలు, శంషాన్‌-కబ్రస్థాన్‌, గులాబీ విప్లవం లాంటి వాటితో వారిని గుర్తించవచ్చని కొన్ని చిన్న సూచనలు చేసినప్పుడు, ద్వేషపూరిత ప్రసంగాల సంకేతాలు పైస్థాయి నుంచే మొదలవుతాయి. ద్వేష భావాన్ని వ్యాప్తి చేసేవారి తదుపరి పొర భాషను తీవ్రతరం చేస్తుంది. ధర్మ సంసద్‌ల విషయానికి వస్తే, అది పవిత్రమైనది. యతి నర్సింగ్‌ నంద్‌ వలె హింస సందేశం మరింత ప్రత్యక్షంగా, చాలా హేయమైనదిగా మారుతుంది.
ఇది, పార్లమెంటులో చాలా స్పష్టంగా కనిపించింది. దనీష్‌ అలీకి వ్యతిరేకంగా రమేష్‌ బిధూరీ చాలా దారుణమైన దూషణలకు దిగాడు. అలీని ‘ముల్లా’, ‘తీవ్రవాది’, ‘జాతి వ్యతిరేకి’, ‘తాడ్పుడు గాడు’, ‘కత్వా’ (ముస్లింలకు వ్యతిరేకమైన కళంకం) అన్నాడు. దీనికి ప్రతిఫలంగా బిధూరీకి అదనపు బాధ్యతలతో కూడిన ఉన్నత పదవిని కట్టబెట్టారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ కలయికలో శ్రేణీగత వ్యవస్థ పైకి వెళ్లే మార్గం ద్వేషపూరిత ప్రసంగమేనని ఇది స్పష్టం చేసింది. బిధూరీ మళ్ళీ ఇదే విధంగా సభలో వ్యవహరిస్తే, ఆయనపై చర్యను తీసుకుంటామని లోక్‌సభ స్పీకర్‌ అనడం ద్వారా ఆయన బిధూరీని ఏమీ అనకుండా వదిలివేసాడు.
ప్రముఖ ముస్లిం మహిళలు, సెలబ్రిటీలను అవమానించడానికి భయంకరమైన బుల్లీ బారు, సల్లీ ఒప్పందాలను మనం చూశాం. ఎలాంటి కఠినమైన శిక్షలు పడకుండానే నేరం మోపబడిన వారు వెళ్ళిపోయారు. ఆలస్యంగా హల్ద్‌ వానీ మసీదు సమస్య కూడా క్షేత్రస్థాయిలో ప్రశాంతతను భగం చేసింది. ప్రస్తుత తరుణంలో నిష్పక్ష పాతంగా ఉండే మీడియా లేకపోవడం చాలా దారుణమైన విషయం. పెద్ద ఛానళ్లకు చెందిన యాంకర్లు ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ప్రతీ పరోక్ష వ్యాఖ్యకు వారిని నిందించడానికి మార్గాలను వెతుకుతున్నారు.
ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు దారితీయడంతో పాటు, ప్రస్తుత సంఘటనల ప్రక్షేపమార్గం నెమ్మదిగా ఇస్లామోఫోబియాను తీవ్రం చేయడానికి దారితీస్తుంది. హోంవర్క్‌ చేయనటువంటి ఒక ముస్లిం విద్యార్థిని, క్లాస్‌లో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరితో చెంప దెబ్బకొట్టాలని తృప్తత్యాగి అనే ఒక టీచర్‌ చెప్పడం మనకు తెలిసిందే. మంజులా దేవీ అనే మరొక ఉపాధ్యాయురాలు, ఒక చిన్న సమస్యపై వాదులాడుకుంటున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులతో ”ఇది మీ దేశం కాదు” అని చెప్పింది. కొంతమంది ప్రయాణీకులు ఉపశమనం పొందడానికి, కొంతమంది ముస్లింలు నమాజ్‌ చేసుకోవడానికి బస్సును ఆపినందుకు మోహన్‌ యాదవ్‌ అనే బస్సు కండక్టర్‌ను ఉద్యోగం నుండి తొలగించడం మనం చూశాం.
ద్వేషపూరిత ప్రసంగాన్ని, మన సమాజంపై శాపంగా గుర్తించారు మన నాయకులు. ఒక ముస్లిం చేతిలో స్వామి సహజానంద హత్య చేయబడిన తరువాత ఈ సమస్యను గాంధీ సరిగానే గుర్తించాడు. ద్వేషపూరిత భావాల్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే పత్రికలను బహిష్కరించడం ద్వారా పరస్పర ద్వేషభావాన్ని, అపకీర్తిని ప్రక్షాళన చేసుకోవాలని పిలుపునిస్తూ ”యంగ్‌ ఇండియా” పత్రికలో రాశాడు. ఇక్కడ గాంధీ, ఆ సమయంలో వార్తాపత్రికలు పోషిస్తున్న ప్రతికూలమైన పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. తరువాత కాలంలో మహాత్మాగాంధీ హత్య తర్వాత కూడా సర్దార్‌ వల్లభ్‌ భారు పటేల్‌ గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యక్షంగా ద్వేష భావాన్ని వ్యాప్తి చేస్తుందని ఆరోపిస్తూ, ”వారి ప్రసంగాలన్నీ మతపరమైన విషంతో నిండిపోయాయనీ, హిందువుల రక్షణ కోసం హిందువుల్ని ఉత్సాహపరచి విషాన్ని వ్యాపింపచేయాల్సిన అవసరం లేదనీ, ఆ విషం ఫలితంగానే మన దేశం ఎంతో విలువైన గాంధీజీ జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని” ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు.
రోజులు గడిచిపోతున్నాయి. అదే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు, ద్వేషాన్ని సష్టించే యంత్రాంగాల పొరలను సష్టిస్తుంది. తన సొంత స్వయంసేవకుల విస్తతమైన సైన్యంతో సహా ప్రచారక్‌లు, పాఠశాలల నెట్‌వర్క్‌, మీడియాలోని ఒక పెద్ద విభాగం అధి కారంలో ఉన్న వారికి లొంగిపోయి, ద్వేష భావాన్ని తీవ్రతరం చేయడానికి వారి పలుకుబడిని యధేచ్ఛగా ఉపయోగించు కుంటుంది. ఈ యంత్రాంగాల ద్వారా సష్టించ బడిన సామాజిక లోకజ్ఞానమే బుల్లీ బారు, సల్లీల ఒప్పందాలకు దారితీస్తుంది. ఇదే తప్తత్యాగీ, మంజులాదేవీలను సష్టించగా, వారు ఆ లోక జ్ఞానాన్ని పిల్లల వద్దకు తీసుకొని వెళ్ళారు. మిశ్రమ పాఠశాలల్లో ముస్లిం పిల్లలకు పరిస్థితులు చాలా క్లిష్టంగా మారుతున్నాయి.
నేడు, ఇతరులను ద్వేషించడం అనేది మన రాజ్యాంగ సౌభ్రాతత్వ విలువకు చాలా విరుద్ధం. ఇది, గాంధీజీ ఆచరించిన హిందూ మతం నైతిక విలువల సహనానికి కూడా వ్యతిరేకంగా ఉంది. ఇది, ”వసుధైవ కుటుంబం” (ప్రపంచం ఒక కుటుంబం) అనే వేదాల వచనాలపై చాలా దూకుడు తనంతో చేస్తున్న దాడి కూడా. ఇది మతపరమైన మైనార్టీల్ని భయపెట్టడమే కాకుండా, మన రాజ్యాంగ విలువలపై కూడా దాడికి పూనుకుంటుంది. ఈ ద్వేషపూరిత ప్రసంగాన్ని ఎదుర్కోవాలంటే, గాంధీ హిందూ మతం, వసుధైవ కుటుంబం, భారత రాజ్యాంగ సౌభ్రాతత్వాలు, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడే వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది.
(”ద వైర్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌
9848412451
రామ్‌ పునియానీ