ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నమస్తే తెలంగాణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

– పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్
– నమస్తే తెలంగాణ దినపత్రికల దగ్ధం
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా తన గుమ్మాస్త పత్రికలో కల్పిత రాతలు రాస్తూ, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యంపై నాన్ బేయిబుల్ సెక్షన్లను నమోదు చేసి  కఠినంగా శిక్షించాలని పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. గత రెండు రోజుల క్రితం బేగంపేట్ విమానాశ్రయంలో  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు రహస్యంగా భేటీ అయ్యారని రాజకీయంగా రహస్య చర్చలు జరిగాయని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన  వార్తలను ఖండిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని హస కొత్తూర్ చౌరస్తా వద్ద 63వ నంబరు జాతీయ రహదారిపై నమస్తే తెలంగాణ దినపత్రికలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు.ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ  కేసీఅర్ గురువు చిన్న జీయర్ స్వామి  కలలోకి వచ్చి  చెప్పినట్లు కేసిఆర్ దినపత్రిక అయిన నమస్తే తెలంగాణ పత్రికలో కల్పిత రాతలు రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్  ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేవిధంగా  దిక్కుమాలిన  రాతలు రాసిన నమస్తే తెలంగాణ దినపత్రికలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిష్కరించాలన్నారు.కేసిఆర్ కు, కేటీఆర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత తండ్రి కొడుకులకు మతిభ్రమించి ఏం చేయాలో  తోయక  కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా తన గుమ్మాస్త పత్రికలో కల్పిత రాతలు రాస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను  మోసం చేస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ సెక్షన్లను నమోదు చేసి  కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన  వార్తల  వెనుక ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కుట్ర కూడా ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కేసిఆర్ కు, జగన్ ఆప్త మిత్రుడని వీరిద్దరూ కలిసి  తెలంగాణలో రాజకీయ అలజడులు సృష్టించి, గజ దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఉన్నది పేదవాడి దైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సంగతి  మర్చిపోవద్దని హెచ్చరించారు.అధికారం పోయినప్పటి నుంచి  తండ్రి కొడుకులు ఆడుతున్న  మైండ్ గేమ్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, అసలు బేగంపేట ఎయిర్ ఫోర్ట్ కి గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లక పోయిన, వెళ్లినట్లు  ఊహాజనితంగా రాతలు రాయించడం మానుకోవాలని కేసిఆర్, కేటీఆర్ లకు హితవు పలికారు. అసలు నమస్తే తెలంగాణ పత్రికను ఒక పేపర్ లాగా చూసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు.చంద్రబాబును కలవాల్సిన  కర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లది గురు శిష్యుల బంధం కాదని, తనది వాళ్ళ పార్టీ లో  ఉన్నప్పుడు సహచరుడునని  ఏనాడో రేవంత్ రెడ్డి  స్పష్టo చేశారని గుర్తు చేస్తున్నాను. మీ కల్పిత రాతలను  కళ్ళు బోల్లి మాటలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి ఏలేటి గంగాధర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్, పాలెపు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవతి గంగాధర్, ఉట్నూర్ ప్రదీప్, జగదీశ్ చారి, వైన్స్ గంగారెడ్డి, అవారి సత్యం, బోనగిరి లక్ష్మణ్, గణేష్ గుప్తా, శశి, తదితరులు పాల్గొన్నారు.