
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం జోనల్ ఐదు జిల్లాల యువజన అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్, లింగమల్ల సునీల్ సూచన మేరకు ఏఈడబ్ల్యుఎస్ కాళేశ్వరం జోనల్ అధికారప్రతినిదిగా వనపాకల రాజయ్యను, ఏవైయు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా మహమ్మద్ రహీం ఖాన్ లను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్, కాళేశ్వరం జోనల్ నాయకులు కుమార్ యాదవ్, బండి సుధాకర్ లకు రాజమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కొండ రాజమ్మ,కాటారం సబ్ డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమత, ఏఏప్ యు జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్ర సారయ్య, ఏవైయు జిల్లా ఉపాధ్యక్షుడు కేశారపు సురేందర్ పాల్గొన్నారు.