సీఎంను కలిసిన అహ్లూవాలియా

సీఎంను కలిసిన అహ్లూవాలియానవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా శనివారం ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో అహ్లువాలియా సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు, గడిచిన పదేండ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, కాంగ్రెస్‌ హయాంలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు సహా పలు అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.