ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి 

నవతెలంగాణ-బెజ్జంకి 
ఈ నెల 29, 30న హైదరాబాద్ యందు నిర్వహించనున్న ఏఐవైఎఫ్ 2వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి దొంతరవేణి మహేశ్ కోరారు.బుధవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద ఏఐవైఎఫ్ నాయకులు రాష్ట్ర మహాసభల వాల్ పోస్టరును అవిష్కరించారు. సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.