దోపిడీ లేని సమాజ స్థాపన కోసం పోరాడేదే ఏఐటీయూసీ…

నవతెలంగాణ -మునుగోడు
దోపిడీ లేని సమాజ స్థాపన కోసం. కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఏఐటీయూసీ అని సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు .  రాష్ట్రప్రభుత్వం  ప్రవేశపెట్టిన వివిధ పథకాలలో అసలైన కార్మికులకు అందకుండా తన అనుకున్న వారికి ఇవ్వడం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహలక్ష్మీ , దళిత బంధువు , బీసీ బందు  ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.  ప్రతి కార్మికునికి టూ వీలర్ వాహనం ఇవ్వాలని కార్మికునికి ఎలాంటి ప్రమాదం జరిగిన ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు చెల్లించాలని వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు ఒక్కటై అవినీతిపరులకు  తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నిజమైన నికారసుగా కార్మికుల పక్షాన నిలబడే నాయకున్ని  గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలాద్రి  , భీమనపల్లి స్వామి , ఏర్పు నరసింహ , నగేష్ , హుస్సేను  దొమ్మాటి గిరి , దసరాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు