ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేయాలి

All government posts should be filled– ముందస్తు అరెస్టులను ఆపాలి
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
గ్రూప్స్ అభ్యర్థుల కోసం డీఎస్సీ  పెంచాలని నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు  ముందస్తు అరెస్టు చేశారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో ఉన్న వివిధ విద్యార్థి యువజన సంఘం నాయకులను జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు స్థానిక విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ లో  ఉన్న విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని,అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని పరీక్షా తేదీలు డిసెంబర్ వరకు తొలగించాలని,అలాగే ప్రభుత్వం డీఎస్సీ సుమారు 23 వేల పోస్టులు భర్తీ చేయాలని,మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టు అపక పోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.