ఈటీవీ విన్ తన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఎయిర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్” అనౌన్స్మెంట్తో మరోసారి ప్రేక్షకుల దష్టిని ఆకర్షించింది. వెబ్ సిరీస్ ప్లాట్ఫామ్లో పెరుగుతున్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా క్యాలిటీ కంటెంట్కిలీ సిరీస్ కేరాఫ్ కానుంది. సందీప్ రాజ్ షో రన్నర్గా ఉన్న ఈ సిరీస్కి జోసెఫ్ క్లింటన్ రైటర్, డైరెక్టర్. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ అఫీషియల్గా లాంచ్ అయ్యింది. ఈ లాంచింగ్ ఈవెంట్ సిరీస్కు నాంది పలికింది. పరిశ్రమ నుంచి ప్రముఖులతో పాటు టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మాత ఎఎస్కేఎన్ అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సిరీస్కి ఒక ఇంట్రెస్టింగ్ టోన్ని సెట్ చేసింది. ఫన్, డ్రామా, ఇంటెన్సిటీ ఉన్న సిరీస్ అని హింట్ కూడా ఇచ్చింది. ఇదొక థ్రిల్లింగ్ వెంచర్గా రూపొందుతోంది. ఇది ప్రేక్షకులకు గుర్తిండిపోయే సిరీస్ కానుంది. స్ట్రాంగ్ క్రియేటివ్ టీం, ప్రముఖ నటీనటులుతో ఈ వెబ్ సిరీస్న ఈటీవీ విన్ లైనప్కు ఒక ఒక ముఖ్యమైన ఎడిషన్. ఈ వెబ్ సిరీస్ ఎమోషన్, డ్రామా, అద్భుతమైన పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్పీరియన్స్ని అందించనుంది. హర్ష రోషన్, భాను ప్రతాప, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి తదితరులు ఇందులో నటిస్తున్నారు.