డిసెంబర్‌ 2న అఖిలపక్ష సమావేశం

డిసెంబర్‌ 2న అఖిలపక్ష సమావేశం– ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు..
– డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు పార్లమెంట్‌…
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సంద ర్భంగా డిసెంబర్‌ 2న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశాలు డిసెంబర్‌ 4న ప్రారంభమై డిసెంబర్‌ 22న ముగుస్తాయి. సమావేశం ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ డిసెంబర్‌ 3న ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కారణంగా ఈసారి అది ఒక రోజు ముందుకు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక బిల్లులను ఆమోదించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ”క్యాష్‌ ఫర్‌ క్వైరీ” ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ నివేదికను లోక్‌సభ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్‌ సిఫారసు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో మూడు కీలక బిల్లులను సెషన్‌లో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హౌమ్‌పై స్టాండింగ్‌ కమిటీ ఇప్పటికే మూడు నివేదికలను ఇటీవల ఆమోదించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటీకి ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నిరసనల మధ్య పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ఆమోదానికి రాలేదు. ఎందుకంటే ఇది క్యాబినెట్‌ కార్యదర్శి హౌదాతో సమానంగా సీఈసీ, ఈసీల హౌదాను తీసుకురావాలని కోరుతోంది.