– పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి
– పేదలకు అందుబాటులో వైద్యం
– అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర
– బడుగు జీవులకు ఖరీదైన వైద్యం
– సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య సామాజిక సేవలు విస్తరిస్తాం
– మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్
– అమేధ హాస్పిటల్స్ సౌజన్యంతో,మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
నవ తెలంగాణ – పటాన్ చెరు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకరకంగా సామాజిక సేవలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి ఉంటుందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో అమేధ హాస్పిటల్స్ సౌజన్యంతో మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమేధ హాస్పిటల్స్ యజమాన్యం వందమందికి పైగా పలు రకాల వైద్య సేవల తోపాటు ఉచిత మందులు, టెస్టులు నిర్వహించారు. అవసరమైన వారికి హాస్పిటల్ కి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు పట్టణ ప్రాంతాలలో కొంతమేర వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ రూరల్ ఏరియాలో అవగాహన లేమితో ప్రజలు ఫ్రీ డయాబెటిక్, డయాబెటిక్ వంటి రోగాల బారిన పడుతు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయటంతో పాటు వారిలో అవగాహన తో పాటు చైతన్య పరచలాని సూచించారు. అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతు పటాన్ చెరు పట్టణంలో హాస్పిటల్ పెట్టిన రోజు నుంచి కార్మికులు,పేద, మధ్యతరగతి వాళ్లకు కమర్షియల్ ఆలోచన తో కాకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ముందు కూడా సామాజిక సేవ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతామని గ్రామాలలో అందరి సహాయ సహకారాలతో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంవికే ఫౌండర్ రాజయ్య మాట్లాడుతు ప్రైవేటు హాస్పిటల్ వైద్యం అంటేనే ఖరీదైనదిగా భావిస్తున్న ఈ రోజుల్లో అన్ని సదుపాయాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తూ అట్టడుగు బడుగు జీవులలో వెలుగు నింపుతున్న అమేధ హాస్పిటల్స్ యజమాన్యాన్ని అభినందించారు.మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మా సంస్థ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనంజయ్,రాజశేఖర్, చిరంజీవి, సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి నాగేశ్వరరావు, అర్జున్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సేవలో అందరు భాగస్వాములు అవ్వాలి
12:06 am