నవతెలంగాణ – కంటేశ్వర్
సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అందరూ ఉన్నదా శిఖరాలను అవరోధించాలి అని నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల మూడవ తేదీన సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పట్టణ వన్ టౌన్ సిఐ విజయ్ సార్ హాజరై విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, అందుకు తగిన కృషి చేయాలని సూచించి, వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. అదేవిధంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 03 న జన్మించి మహిళల జీవితాలలో వెలుగులు నింపిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ తరం విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా స్త్రీలకు విముక్తి కల్పించిన మాతృమూర్తి అని ఆయన కొనియాడారు. తన తొమ్మిదవ ఏటా జ్యోతిబాపూలే గారిని వివాహమాడి ఈ సమాజం కోసం తన భర్త నుండి చదువు నేర్చుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొని మొదటి మహిళా టీచర్ గా అందించాడని అన్నారు. అదేవిధంగా పేదలకు ఉచిత విద్యను నాగపూర్ లో విద్యాలయాలు స్థాపించారని అన్నారు. మరియు సత్యశోధక సమాజం ను ఏర్పాటు చేసి బాల్యవివాహాలను, అంటరానితనన్ని అంతం చేయాలని అన్నారు. అదేవిధంగా రెండు వేల మంది అనాథలను దత్తత తీసుకున్నారని అన్నారు. అదేవిధంగా విద్యార్థులంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే, సావిత్రి భాయి పూలే మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ మాధవి మేడం మరియు ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు విశాల్ నగర ఉపాధ్యక్షులు దీపిక సందీప్ వేణు ఎస్ఎఫ్ఐ నగర నాయకులు బాబురావు, వరదరాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.