నూతన విద్యా విధానానికి శుభాకాంక్షలు

– ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌ రెడ్డి
నవతెలంగాణ- జడ్చర్ల
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌ రెడ్డి కానుక జడ్చర్ల నియోజకవర్గంలోని నూతన విద్యా విధానానికి శుభాకాంక్షలు తెలిపి ఘూలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నా సొంత నిధులతో జడ్చర్ల నియోజకవర్గంలోని 274 ప్రభుత్వ పాఠశాలలోని 53 వేల పైచిలుకు విద్యార్థులందరికీ చేస్తానని తెలిపారు.మీడియా సమావేశం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు. పార్లమెంట్‌ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 తారీకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా జరుగుతది, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రుణమాఫీ చేస్తామని తెలిపారని అన్నారు.అసెంబ్లీ ఎలక్షన్‌ కంటే ముందు నేను పాదయాత్ర చేస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ షులు ఇప్పిస్తానని చెప్పినట్లుగా నేడు నియోజకవర్గంలోని 274 పాఠశాలలోని 53 వేల పైచిలుకు విద్యార్థులందరికీ షు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఆగస్టు చివరి లోగా మా కాంగ్రెస్‌ కార్యకర్తలను నాయకులను కమిటీలుగా వేసి ఆయా గ్రామాలలో ఉన్న పాఠశాల వెళ్లి విద్యార్థుల సైజులు తీసుకొని విద్యార్థులకు షులు పంపిణీ చేస్తామని అన్నారు. తొందర్లోనే ఆ టీవీలను పాఠశాలలో అమర్చి విద్యార్థులకు ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి,ఆన్లైన్‌ క్లాసులు వినడానికి ఉపయోగపడేలా చేస్తామని అన్నారు.