రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

– ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
– ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయం ప్రాంగణం ఆవరణలో ధన్వాడ గ్రామ ప్రజల అధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి,మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దుద్దీళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్ని స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించి కళ్యాణం చివరి వరకు ఉండి తిలకించారు. ఈ సందర్భంగా  దుద్దీళ్ళ  మాట్లాడారు రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో  వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రంలోని రైతులకు అధిక దిగుబడి రావాలని త్వరలో యాగం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.