అల్లు అర్జున్‌, సుకుమార్‌ ముఖ్య అతిథులుగా..

Allu Arjun and Sukumar as chief guests..ఎటువంటి పాత్రలోనైనా జీవించగల విలక్షణ నటుడు రావు రమేష్‌. ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్రే సినిమాటిక్స్‌ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మించారు. దర్శకుడు సుకుమార్‌ సతీమణి తబిత సమర్పణలో ఈనెల 23న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీహొరిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్న ఆ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అల్లు అరవింద్‌ కుమారుడినని, అల్లు అర్జున్‌ తన అన్నయ్య అని భావించే యువకుడిలా ‘మారుతి నగర్‌ సుబ్రమణ్యం’లో రావు రమేష్‌ తనయుడిహొపాత్ర ఉంటుందని, అందులో అంకిత్‌ కొయ్య నటించారనిహొదర్శకుడు లక్ష్మణ్‌ కార్య తెలిపారు. అల్లు అర్జున్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లోహొసన్నివేశాలనుహొరీ క్రియేట్‌ చేస్తూ ‘మేడం సార్‌ మేడం అంతే’ పాటను తెరకెక్కించామనిహొఆయన చెప్పారు. రావు రమేష్‌, ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్‌, అజరు, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్‌, భాస్కరభట్ల, కళ్యాణ్‌ చక్రవర్తి, ఆర్ట్‌ డైరెక్షన్‌: సురేష్‌ భీమంగని, ఎడిటర్‌: బొంతల నాగేశ్వర్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ: ఎంఎన్‌ బాల్‌ రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్‌ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య, కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌: లక్ష్మణ్‌ కార్య.
Allu Arjun and Sukumar as chief guests..