ఆత్మీయ అనురాగాలు పంచుకున్న  పూర్వ విద్యార్థులు

– చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్న 2005-06 ssc బ్యాచ్ 
నవతెలంగాణ –  మిరుదొడ్డి 
చిన్న  నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ 18 సంవత్సరాల  తర్వాత కలుసుకున్న స్నేహితులు మిరుదొడ్డి మండల కేంద్రం లోని బాలాజీ ఫంక్షన్ హల్ లో ఆనందంగా గడిపారు. తమ స్నేహ బంధాలను గుర్తుకు తెచ్చుకుని సందడి చేశారు. మండల కేంద్రంలోని విజ్ఞాన భారతి విద్యాలయంలో పదో తరగతి విద్యాభ్యాసం చేసిన 2005-2006  సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలలో, ఉద్యోగాలలో స్థిరపడిన వారంతా 18 సంవత్సరాల  తదుపరి ఒక్కచోట చేరారు. తమకు అప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో ఘనంగా  సన్మానించారు. ఏ ఏ సబ్జెక్టు టీచర్లు ఎలా బోధించారో  గుర్తు చేస్తూ,  తమదైన శైలిలో ప్రసంగించారు. నాడు బోధించిన  సంస్కారమే నేడు  సమాజంలో రాణిస్తున్నామంటూ  ఉపాద్యాయులు చేసిన సేవలను కొనియాడారు. విద్య బుద్దులు నేర్పిన గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల  ప్రధానోపాధ్యాయులు సత్తు  మహిపాల్ రెడ్డి, ర్యాకం మల్లేశం, మాలే రమేష్, శివకుమార్, ఆనంద్, వెంకటేష్,  శేఖర్, ప్రకాష్,  పూర్వ విద్యార్థులు శ్రీలత, కళ్యాణి, లావణ్య, బబిత, మమత, లత, రేణుక, స్వాతి, సంపత్, కొండల్ రెడ్డి, కుమార్, రాజు, స్వామి, రమేష్, శ్రీకాంత్, భానువికాస్, పోచయ్య, ఆంజనేయులు, రాంబాబు, వీరాంజనేయులు, శoకర్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.