ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఫీల్ గుడ్ లవ్స్టోరీతో దర్శకుడు పి.ఎల్.విఘ్నేష్ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని రూపొందించారు. దీన్ని పారమళ్ళ లింగయ్య నిర్మించారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ చిత్ర గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్లో మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ధనుంజరు, అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది.శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, ‘పాట చూశాను. చాలా బాగుంది. దర్శక, నిర్మాత విఘ్నేష్ ఎంతో ప్యాషన్తో సినిమా తీశాడని అర్థం అవుతోంది. మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం:మార్కండేయ, కెమెరా:ఈదర ప్రసాద్, ఎడిటర్:కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్:విజయకష్ణ.