అద్భుతంగా తెల్లారు పొద్దుల్లో..

ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీలకు ప్రేక్షకుల సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీతో దర్శకుడు పి.ఎల్‌.విఘ్నేష్‌ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని రూపొందించారు. దీన్ని పారమళ్ళ లింగయ్య నిర్మించారు. సదన్‌ హీరోగా, ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్‌ చేసిన కంటెంట్‌ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ చిత్ర గ్లింప్స్‌, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే ఈ మెలోడియస్‌, రొమాంటిక్‌ పాటను కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. ధనుంజరు, అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది.శేఖర్‌ మాస్టర్‌  మాట్లాడుతూ, ‘పాట చూశాను. చాలా బాగుంది. దర్శక, నిర్మాత విఘ్నేష్‌ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడని అర్థం అవుతోంది. మోహన్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం:మార్కండేయ, కెమెరా:ఈదర ప్రసాద్‌, ఎడిటర్‌:కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్‌:విజయకష్ణ.