ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘తంగలాన్’ సినిమా భారీ నిర్మాణ విలువలు, విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశారు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్లోకి వచ్చి బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్ ఫుల్ టాక్తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో ఈ సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. ఒక్క నైజాం ఏరియాలోనే 90 థియేటర్స్ పెంచటం విశేషం. తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు విడుదలైన ‘తంగలాన్’ గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది. రెండో వారంలోనూ భారీగా పెరిగిన ఈ థియేటర్స్ ఈ చిత్ర దిగ్విజయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా, నీలమ్ ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూ రోజు రోజుకి కలెక్షన్లతోపాటు ధియేటర్ల సంఖ్యనూ పెంచుకుంటోంది.