బ్రెజిల్‌ అధ్యక్షుడిపై తిరుగుబాటు కుట్రకు యత్నం

–  ఐదుగురికి జైలు శిక్ష విధించిన సుప్రీం
బ్రసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడుగా ఎన్నికైన లూలా డసిల్వా విజయాన్ని తారుమారు చేసేందుకు ఈ ఏడాది జనవరి 8న జరిగిన కుట్ర ప్రయత్నం లో ప్రమేయమున్న ఐదుగురికి సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించింది. మంగళవారం నాడు ఐదుగురిని దోషులుగా తేల్చడంతో ఇప్పటివరకు ఈ తిరుగుబాటు నేరంలో దోషులుగా నిర్ధారించిన వారి సంఖ్య 25కి చేరుకుంది. సాయుధ నేరంలో పాలుపంచుకోవడం, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ప్రక్రియను హింసాత్మకంగా రద్దుచేయడానికి ప్రయత్నించడం, కుట్రకు పాల్పడడం, విధ్వంసానికి దిగడం వంటి అభియోగాలపై జరిగిన విచారణలో వారు దోషులుగా తేలారు. అయితే వారికి విధించాల్సిన శిక్షలపై న్యాయ స్థానం ఏకాభిప్రాయానికి రాలేక పోయింది.
నుండి 17ఏళ్ళ జైలు శిక్ష విధించాలని స్పీకర్‌, మంత్రి అలెగ్జాండర్‌ డీ మోరెస్‌ ప్రతిపాదించారు. మేజిస్ట్రేట్‌లు ఇరువురు ఆయనకు మద్దతిచ్చారు. అయితే మరో ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం 11నుండి 15ఏళ్ళ పాటు శిక్ష విధించాలని ప్రతిపాదించారు. విధ్వంసానికి దిగి ప్రభుత్వ భవనాలకు నష్టం వాటిల్లేలా వ్యవహరించినందుకు ఈ ఐదురుగు కలిసి 30మిలియన్ల రియాస్‌ నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కొత్త ప్రభుత్వాన్ని కూలదోయడంలో జేర్‌ బోల్సనారో, ఆయన అనుచరుల ప్రమేయం వుందని సెప్టెంబరులో అధ్యక్షుడు లూలా విమర్శించారు. బోల్సనారో వాటిని తోసిపుచ్చారు.