అందరికీ కనెక్ట్‌ అయ్యే దీక్ష

An initiative to connect everyoneఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’.
పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు.
తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్‌ను దర్శక, నిర్మాత ఆర్‌.కె.గౌడ్‌ మీడియాకి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్‌ వర్క్‌, ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీక్ష ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించాం. ఈ పాయింట్‌ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్‌ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్‌లో కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఉంటాం. ఈ మూవీలో హీరో కిరణ్‌ నటన ఆకట్టుకుంటుంది. భీముడి గెటప్‌లో ఆయన చెప్పిన నాన్‌స్టాప్‌ డైలాగ్‌ హైలైట్‌ అవుతుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మంచి మ్యూజిక్‌, పాటలతో మా మూవీ ఆకట్టుకుంటుంది. మా ప్రొడ్యూసర్‌ అశోక్‌ కుమార్‌ మంచి సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన తర్వాత మహిళా కబడ్డీ సినిమాను లాంచ్‌ చేేస్తాం’ అని అన్నారు.
‘ఈ మూవీతో పాటు మహిళా కబడ్డీలోనూ నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కింది’ అని హీరో కిరణ్‌ చెప్పారు.
నటి అక్సాఖాన్‌ మాట్లాడుతూ,’ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరుతోపాటు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలను తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
ఇందులో నటించిన అనూష, తులసి తదితరులు చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘కావేరి’ చిత్ర నిర్మాత షేక్‌ అల్లాబక్షు, కావేరి చిత్రబృందం పాల్గొని ‘దీక్ష’ సినిమా టీమ్‌కు బెస్ట్‌ విషెస్‌ అందజేశారు.