సరికొత్త పాయింట్‌తో అగ్లీ స్టోరీ

సరికొత్త పాయింట్‌తో అగ్లీ స్టోరీలక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా ప్రణవ స్వరూప్‌ దర్శకత్వంలో నందు, అవికా గోర్‌ హీరో, హీరోయిన్లుగా నిర్మిస్తున్న సినిమా ‘అగ్లీ స్టోరీ’. ఇటీవల రిలీజ్‌ అయిన గ్లింప్స్‌ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణవ స్వరూప్‌ మాట్లాడుతూ, ‘ఈ మూవీతో 2024లో హిట్టు కొట్టబోతున్నాం. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్‌, సుభాషిని, కొండా లక్ష్మణ్‌ నన్ను, నా కథను నమ్మి నిర్మించారు. గతంలో రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు రిలీజ్‌ అయిన గ్లింప్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్‌ క్లైమాక్స్‌లో నందు చెప్పిన ‘ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ రియల్‌ లైఫ్‌లో ఉండదు’ అనే డైలాగ్‌కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ గ్లింప్స్‌ ఇచ్చిన రెస్పాన్స్‌తో టీజర్‌, ట్రైలర్‌, సినిమాని ఇంకా చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌కి వెళ్తున్నాం’ అని అన్నారు.