జన్వాడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,నవతెలంగాణ-శంకర్‌పల్లి
జన్వాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శంకర్‌పల్లి శంకర్‌పల్లి మండలం మోకిలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జన్వాడ గ్రామంలో చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జన్వాగ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి సుమారు(45) రోడ్డుకు పక్కగా పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే, మోకిలా పోలీసులను సంప్రదించాలని ఎస్‌హెచ్‌ఓ మోకిలా పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.