ముంబయి : టాటా గ్రూపు నుంచి మరో కంపెనీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుందని సమాచారం. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం)ను పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడం ద్వారా 1-2 బిలియన్ డాలర్ల (రూ.8-16వేల కోట్లు) వరకు సమీకరించొచ్చని రిపోర్టులు వస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 తొలినాళ్లలో ఐపీఓ ఉండొచ్చని తెలుస్తోంది. టాటా గ్రూపు నుంచి దాదాపు 18 ఏండ్ల తర్వాత గతేడాది చివరలో టాటా టెక్ ఐపీఓకు వచ్చిన విషయం తెలిసిందే.