కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏఓ

AO who visited the purchase centre– కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడకుండా గ్రామాల వారీగా తేదీలు ప్రకటిస్తాం 
నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మార్కెట్ కమిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి రాజు, మద్నూర్ సొసైటీ సీఈఓ జె బాబురావు  కలిసి మంగళవారం పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి  మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కాంట చేయాలని సూచించారు. అలాగే అన్ని గ్రామాల రైతులు ఒకేసారి సోయాబీన్ పంటలను కేంద్రానికి తీసుకురాకుండా గ్రామాల వారిగా  తేదీలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏ గ్రామానికి ఏ తేదీ ఇచ్చారో ఆరోజు తీసుకురావాలని, తద్వారా కొనుగోలు కేంద్రమంలో రద్దీ ఏర్పడకుండా, రైతులు నిరీక్షణ చేయకుండా.. ఉండటానికి గ్రామాల వారీగా టోకెన్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు సోయాబీన్ తీసుకువచ్చేటప్పుడు మీ మీ గ్రామాల ఏ ఈ ఓ ల వద్ద  టోకెన్  రాయించుకొని కేంద్రానికి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ బాబు రావ్, ఏ ఈ ఓ లు , సౌమ్య,అనిల్, బజాన్న, రైతులు పాల్గొన్నారు.